తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 8:20 PM IST

ETV Bharat / sitara

మూడోసారి రియాకు ఎన్​సీబీ సమన్లు

సుశాంత్​ రాజ్​పుత్ కేసు విచారణలో భాగంగా మూడో సారి రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది ఎన్​సీబీ. మంగళవారం మరోసారి దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించింది.

Rhea Chakraborty
రియా చక్రవర్తి

సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసుపై నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. సోమవారం రియా చక్రవర్తిని 8 గంటల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం మరోసారి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో పాటు సుశాంత్​ సహాయకుడు దీపేశ్​ సావంత్​కు​ మాదక ద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం మొదటిసారి ఎన్​సీబీ ముందు రియా హాజరు కాగా.. సుమారు ఆరు గంటల పాటు అధికారులు ఆమెను విచారించారు. సుశాంత్​ కేసులో మాదక ద్రవ్యాల వాడకంపై వివిధ కోణాల్లో రియాపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డ్రగ్స్​ సేకరణలో నిందితులుగా పేర్కొంటూ.. రియా సోదరుడు షౌవిక్​, శామ్యూల్​ మిరండాలను ఎన్​సీబీ అరెస్టు చేసింది. వీరు ప్రస్తుతం రిమాండ్​లో ఉన్నారు. త్వరలోనే వీరిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details