తెలంగాణ

telangana

సంక్రాంతికి షూటింగ్​ పూర్తి... ఉగాదికి విడుదల

నేచురల్​ స్టార్​ నాని కథానాయకుడిగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వి'. ఇందులో సుధీర్​బాబు మరో కథానయకుడు. నివేదా థామస్​, అదితి రావు హైదరి కథానాయికలు. సంక్రాంతి రోజున చిత్రీకరణ పూర్తయినట్లు నాని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

By

Published : Jan 15, 2020, 2:07 PM IST

Published : Jan 15, 2020, 2:07 PM IST

Nani-Sudherer babu 'V' movie shoot completed on Pongal(Sankranthi) directed by Mohan Krishna Indraganti
సంక్రాంతికి షూటింగ్​ పూర్తి... ఉగాదికి విడుదల

టాలీవుడ్​ ప్రముఖ హీరో, నేచురల్​ స్టార్​ నాని అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా ఈ పర్వదినాన తను ప్రధాన పాత్ర పోషిస్తున్న 'వి' చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించాడు. గతేడాది మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా.. ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు.

సుధీర్‌బాబు, నాని కాంబినేషన్​లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మోహన్‌ ఇంద్రగంటి దర్శకుడు. తొలిసారి ఈ హీరోలిద్దరూ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​ పతాకంపై దిల్​రాజు నిర్మిస్తున్నాడు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుక రానున్నట్లు తెలియజేస్తూ... గతంలోనూ చిత్రం ఓ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం.

వి సినిమాలో నాని, నివేదా, సుధీర్​బాబు, అదితి,దర్శకుడు ఇంద్రగంటి

"ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు - విలియమ్ షేక్స్‌పియర్‌.' నా శత్రువులందరూ.. జాగ్రత్తగా ఉండండి. వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు' అని చిత్రబృందం పేర్కొంది. ఈ పోస్టర్‌పై స్పందించిన నాని "వైలెన్స్‌ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్‌గా ఇస్తా.." అని అన్నాడు.

నిర్మాతగానూ...

ఈ ఏడాది నిర్మాతగానూ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ స్టార్​ హీరో ప్రొడక్షన్‌ హౌస్‌ 'వాల్‌పోస్టర్‌ సినిమా' చిత్రీకరణ ప్రారంభించింది. ఈ మూవీకి 'హిట్‌ ది ఫస్ట్‌ కేస్‌' అనే టైటిల్​ను పెట్టారు. శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయం కానున్నాడు. విశ్వక్‌సేన్‌ కథానాయకుడు. రుహాని శర్మ కథానాయిక. ప్రశాంతి తిపిర్నే‌ని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఇదే బ్యానర్​పై 'అ!' సినిమా వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details