తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2020, 5:01 AM IST

Updated : Aug 14, 2020, 6:34 AM IST

ETV Bharat / sitara

'ఓటీటీలో వద్దు.. థియేటర్లలోనే రిలీజ్​ చేయండి'

అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్​ నటించిన కొత్త చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేయొద్దని.. ఆయా నిర్మాణ సంస్థలకు టాలీవుడ్​ అగ్రకథానాయకుడు నాగార్జున చెప్పినట్లు సమాచారం. ఆ రెండు చిత్రాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నాగ్​ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

Nagarjuna warns Chay and Akhil's new movie producers
'ఓటీటీలో వద్దు.. థియేటర్లలోనే రిలీజ్​ చేయండి'

సినిమాల విడుదల విషయంలో చాలా పక్కాగా ఉంటారు అగ్రకథానాయకుడు నాగార్జున. ఆయన కుమారుల కొత్త చిత్రాల రిలీజ్​పైనా అంతే శ్రద్ధ చూపిస్తారు. నాగచైతన్య ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగా.. అఖిల్​ మాత్రం సరైన హిట్​ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తన కుమారుల కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్​ చేయొద్దని సదరు నిర్మాతలతో నాగ్​ మాట్లాడని సమాచారం.

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'లవ్​స్టోరీ' తెరకెక్కుతుండగా.. అఖిల్​ హీరోగా అల్లు అరవింద్​ నిర్మాణంలో 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్​' చిత్రం రూపొందుతోంది. ఈ రెండు సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలకు నాగార్జున సూచించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Last Updated : Aug 14, 2020, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details