తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2019, 2:19 PM IST

Updated : Jul 25, 2019, 3:06 PM IST

ETV Bharat / sitara

'మన్మథుడు2 మా కథ కాదు.. కాపీ అంతకన్నా కాదు'

త్వరలో విడుదల కానున్న 'మన్మథుడు-2' ఏ సినిమాకీ కాపీ కాదని చెప్పాడు ఆ చిత్ర హీరో నాగార్జున. అలా అని సొంత కథ కూడా కాదన్నాడు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

మన్మథుడు-2 చిత్రంలో హీరో నాగార్జున

కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు-2' ట్రైలర్​ను విడుదల చేశారు. నాగ్​ కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచిన 'మన్మథుడు'కు ఇది సీక్వెల్. ఈ సందర్భంగా చిత్ర విశేషాల్ని పంచుకున్నాడు అక్కినేని కథానాయకుడు.

"ఈ చిత్రం ఓ ఆంగ్ల చిత్రానికి కాపీ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలా అని సొంత కథ కూడా కాదు. ఓ ఫ్రెంచ్‌ కామెడీ సినిమా ఆధారంగా రూపొందించాం. ఏడాదిన్నర క్రితం ఆ చిత్రం చూశా. నాకు బాగా నచ్చడం వల్ల రీమేక్‌ హక్కులు కొనుగోలు చేశాం. ఆ తర్వాత ఈ కథను దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ చేతుల్లో పెట్టాం. రీమేక్‌ అయినప్పటికీ.. మాతృకతో పోలిక ఉండదు. కేవలం కథలోని ఆత్మను మాత్రమే తీసుకోని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చాం. దీని కోసం రాహుల్‌కు ఏడాదికి పైగా సమయం పట్టింది" -నాగార్జున, కథానాయకుడు.

మన్మథుడు-2 చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన్మథుడు 2’ను ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ హిట్‌ సినిమా ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ఎక్కడో కొడుతంది చిన్నా... 'మన్మథుడు' ట్రైలర్

Last Updated : Jul 25, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details