తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారికి కరోనా సోకలేదు: నాగబాబు

మెగా ఫ్యామిలీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే నటులు రామ్​ చరణ్, వరుణ్ తేజ్​లకు పాజిటివ్​గా తేలింది. నిహారిక, ఆమె భర్త చైతన్యలకు కూడా కొవిడ్​ సోకిందనే కథనాలు వచ్చాయి. వాటిపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్​ నాగబాబు.

By

Published : Dec 31, 2020, 5:03 PM IST

nagababu clarity on niharika, chaitanya corona rumours
'నిహారిక, చైతన్యలకు కరోనా'పై నాగబాబు క్లారిటీ

మెగా డాటర్​ నిహారిక, ఆమె భర్త చైతన్యకు కరోనా సోకిందనే కథనాలకు చెక్​ పెట్టారు నాగబాబు. వారికి కొవిడ్​ లేదని స్పష్టం చేశారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వారిద్దరూ మాల్దీవులకు వెళ్లి వచ్చారు.

"డిసెంబర్ 26న మాల్దీవులకు వెళ్లే ముందు, తిరిగొచ్చాక డిసెంబర్ 29న ముంబయి విమానాశ్రయంలో ప్రభుత్వ నియమాల ప్రకారం నిహారిక, చైతన్య కొవిడ్​ పరీక్షలు చేసుకున్నారు. రెండింటిలోనూ కరోనా నెగిటివ్​గా తేలింది."

-నాగబాబు

ఇటీవలే ఓ పార్టీలో పాల్గొన్నారు మెగా, అల్లు కుటుంబసభ్యులు. ఆ తర్వాత తమకు కొవిడ్​ సోకిందని వెల్లడించారు కథానాయకులు చరణ్, వరుణ్ తేజ్. తమతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో కొవిడ్​ టెస్టుకు వెళ్లిన అల్లు శిరీష్.. తనకు నెగటివ్​ వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:అర్ధరాత్రి 'వకీల్​సాబ్' అప్​డేట్

ABOUT THE AUTHOR

...view details