తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మర్డర్' ప్రమోషన్​కు భద్రత కల్పించాలని నిర్మాత వినతి

By

Published : Dec 21, 2020, 12:56 PM IST

Updated : Dec 21, 2020, 1:31 PM IST

murder-producer-natti-kumar-letter-to-nalgonda-sp-to-provide-security
'మర్డర్' ప్రమోషన్​కు భద్రత కల్పించాలని నిర్మాత వినతి

12:46 December 21

'మర్డర్' ప్రమోషన్​కు మిర్యాలగూడలో భద్రత కల్పించాలని ఎస్పీకి వినతి

'మర్డర్' సినిమా ప్రమోషన్​కు మిర్యాలగూడలో భద్రత కల్పించాలని ఎస్పీకి నిర్మాత నట్టి కుమార్ వినతి పత్రం సమర్పించారు. అమృత కుటుంబ సభ్యులు థియేటర్ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 22న మిర్యాలగూడలోని నటరాజ్ థియేటర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పాల్గొననున్నట్లు తెలిపారు. తమకు ఏదైనా హాని జరిగితే మారుతీ రావు, అమృత కుటుంబ సభ్యులే అందుకు కారణమని ఆయన లేఖలో పేర్కొన్నారు.

మిర్యాలగూడ ప్రమోషన్ కార్యక్రమాల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. అమృత-ప్రణయ్ ప్రేమ వ్యవహారంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  

ఇదీ చదవండి: పవన్ ‌కల్యాణ్‌కు హ్యాండిచ్చిన శృతిహాసన్‌!

Last Updated : Dec 21, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details