తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2020, 12:08 PM IST

Updated : Sep 30, 2020, 12:40 PM IST

ETV Bharat / sitara

రేప్ కేసులో దర్శకుడు అనురాగ్ కశ్యప్​కు సమన్లు

నటి పాయల్ ఘోష్ చేసిన ఫిర్యాదులో భాగంగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్​కు సమన్లు జారీ చేశారు ముంబయి పోలీసులు.

Mumbai Police summons film director Anurag Kashyap
రేప్ కేసులో దర్శకుడు అనురాగ్ కశ్యప్​కు సమన్లు

లైంగిక ఆరోపణల కేసులో, బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్​కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలని ఆదేశించారు.

అసలేం జరిగింది?

అనురాగ్ తనను, 2013లో లైంగికంగా వేధించాడని, అత్యాచారం కూడా చేశాడని నటి పాయల్ ఘోష్ చెప్పింది. వెర్సోవా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అతడిపై రేప్ కేసు పెట్టిన ముంబయి పోలీసులు.. ఇప్పుడు సమన్లు జారీ చేశారు.

నటి పాయల్ ఘోష్

అయితే పాయల్ ఆరోపణలను అనురాగ్ ఖండించారు. అవన్నీ నిరాధరమైనవని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా కలతచెందానని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తన లాయర్‌తో కలిసి ముందుకెళతానని అన్నారు.

Last Updated : Sep 30, 2020, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details