> తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి 'ఢీ'. దీని సీక్వెల్కు 'డబుల్ డోస్' టైటిల్ను నిర్ణయిస్తూ సోమవారం(నవంబరు 23) ప్రకటన చేశారు. హీరో విష్ణు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ను కూడా విడుదల చేశారు. 'ఢీ' తీసిన శ్రీను వైట్లనే దీనికి దర్శకత్వం వహించనున్నారు.
> జూ.ఎన్టీఆర్ 'అరవింద సమేత' మళ్లీ రికార్డులు సృష్టిస్తోంది. అదేంటి ఎప్పుడో 2018లో విడుదలైంది కదా.. ఇప్పుడు రికార్డులేంటి అనుకుంటున్నారా? హిందీ డబ్బింగ్ వెర్షన్ను యూట్యూబ్లో ఆదివారం విడుదల చేయగా, కేవలం ఒక్కరోజులోనే 10 మిలియన్ వ్యూస్ సాధించడం సహా మూడు లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది.
> హీరోలు నాగచైతన్య, మంచు విష్ణుల పుట్టినరోజు సందర్భంగా వారు నటిస్తున్న 'లవ్స్టోరి','మోసగాళ్లు' సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. చైతూ లుంగీ లుక్తో అలరిస్తుండగా, విష్ణు స్టైలిష్గా చూస్తూ ఆసక్తి రేపుతున్నారు.