విలక్షణ నటుడు మోహన్లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం 'దృశ్యం'. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్ అయి రికార్డు సృష్టించింది. థియేటర్లో ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. గురువారం మోహన్లాల్ పుట్టిన రోజు సందర్భంగా 'దృశ్యం2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
మోహన్లాల్ ఫ్యాన్స్కు శుభవార్త.. 'దృశ్యం 2' వస్తోంది - దృశ్యం 2 వార్తలు
మోహన్లాల్ హీరోగా 2013లో విడుదలైన చిత్రం 'దృశ్యం'. అక్కడ ఘన విజయాన్ని అందుకుని ఇతర భాషల్లోనూ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈరోజు మోహన్లాల్ పుట్టినరోజు సందర్భంగా 'దృశ్యం 2' ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
మోహన్లాల్
సీక్వెల్నూ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 'దృశ్యం' పేరుతో తెలుగులో వెంకటేశ్, మీనా నటించగా, హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది.
Last Updated : Aug 12, 2020, 4:51 PM IST