తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోహన్​లాల్ ఫ్యాన్స్​కు శుభవార్త.. 'దృశ్యం 2' వస్తోంది - దృశ్యం 2 వార్తలు

మోహన్​లాల్ హీరోగా 2013లో విడుదలైన చిత్రం 'దృశ్యం'. అక్కడ ఘన విజయాన్ని అందుకుని ఇతర భాషల్లోనూ హిట్​ టాక్​ను సొంతం చేసుకుంది. తాజాగా ఈరోజు మోహన్​లాల్ పుట్టినరోజు సందర్భంగా 'దృశ్యం 2' ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

మోహన్​లాల్
మోహన్​లాల్

By

Published : May 21, 2020, 4:58 PM IST

Updated : Aug 12, 2020, 4:51 PM IST

విలక్షణ నటుడు మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం 'దృశ్యం'. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్‌ అయి రికార్డు సృష్టించింది. థియేటర్‌లో ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. గురువారం మోహన్‌లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా 'దృశ్యం2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

సీక్వెల్‌నూ జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 'దృశ్యం' పేరుతో తెలుగులో వెంకటేశ్‌, మీనా నటించగా, హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది.

Last Updated : Aug 12, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details