తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2019, 11:32 AM IST

Updated : Sep 30, 2019, 10:44 AM IST

ETV Bharat / sitara

200 కోట్ల క్లబ్​లో తొలిసారిగా అక్షయ్ కుమార్

కథానాయకుడు అక్షయ్ కుమార్​.. 'మిషన్​ మంగళ్'తో తొలిసారిగా రూ.200 కోట్లు వసూళ్లు సాధించాడు. ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్​ ధావన్​ జీవితం ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం.

200 కోట్ల క్లబ్​లో హీరో అక్షయ్ కుమార్

ప్రముఖ హీరో అక్షయ్ కుమార్.. ఇటీవలే 'మిషన్​ మంగళ్'తో ప్రేక్షకులని పలకరించాడు. ఇప్పుడీ సినిమాతో తన కెరీర్​లోతొలిసారిగా రూ.200 కోట్ల మార్క్​ను అందుకున్నాడు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ఈ కలెక్షన్స్ సాధించేందుకు 29 రోజులు తీసుకుందీ చిత్రం.

భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్​ ధావన్ జీవితం ఆధారంగా రూపొందింది 'మిషన్ మంగళ్'. ఆయన పాత్రలో అక్షయ్ నటించాడు. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, తాప్సీ తదితరులు ఇతర పాత్రల్ని పోషించారు. జగన్ శక్తి దర్శకత్వం వహించాడు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 30, 2019, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details