తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2019, 7:49 PM IST

ETV Bharat / sitara

ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. 'మిషన్‌ మంగళ్‌'

అక్షయ్ కుమార్.. శాస్త్రవేత్త రాకేశ్​ ధావన్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిషన్ మంగళ్'. టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. 'మిషన్‌ మంగళ్‌'

2013లో భారతదేశం చేపట్టిన 'మంగళయాన్' మిషన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం 'మిషన్ మంగళ్'. ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్ ధావన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాకేశ్​ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది.

"ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. భారత దేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్‌. ఈ స్ఫూర్తిదాయక కథ ఆధారంగా రానున్న చిత్ర టీజర్‌ ఇదుగో" అంటూ ట్విట్టర్​లో టీజర్​తో పాటు వ్యాఖ్య జోడించాడు అక్షయ్ కుమార్.

అంగారక గ్రహంపై 'మంగళ్‌యాన్‌' వెళ్లేందుకు లాంచింగ్‌ ప్యాడ్‌ వద్ద సిద్ధంగా ఉండటం. అక్షయ్‌.. అతని బృందమంతా ఆ ప్రయోగాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్న సన్నివేశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఇందులో శాస్త్రవేత్తల బృందానికి అధికారిణిగా విద్యాబాలన్‌ కనిపించనుంది. నిత్యా మేనన్, తాప్సీ, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి ఇతరపాత్రలు పోషించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ఆగస్టు 15న బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ

ABOUT THE AUTHOR

...view details