తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2019, 11:16 AM IST

ETV Bharat / sitara

క్రికెటర్ కౌసల్య.. ఇప్పుడు ఫైటర్​గా మారింది!

ఐశ్వర్య రాజేశ్, ఉదయ్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'మిస్​మ్యాచ్​' ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. ఇందులో రెజ్లర్​ పాత్రలో కనిపించనుందీ భామ.

ఐశ్వర్య రాజేశ్

కొన్నినెలల క్రితం 'కౌసల్య కృష్ణమూర్తి'గా వచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. తొలి సినిమాతోనే తెలుగులో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రెజ్లర్​గా కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ పాత్రలో ఐశ్వర్య నటిస్తున్న చిత్రం 'మిస్​ మ్యాచ్​'. ట్రైలర్​ను బుధవారం.. దర్శకుడు సురేందర్​రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఇందులోని.. 'ఇద్దరు గొడవపడితే ఒకడు గెలుస్తాడు. అదే కాంప్రమైజ్​ అయ్యారనుకో ఇద్దరూ గెలుస్తారు', 'ఆటకు, గొడవకు తేడా తెలియని మనుషులు.. ఎంత తెలుసుకుంటే ఏం లాభం' అనే డైలాగ్​లు అలరిస్తున్నాయి.

ఈ చిత్రంలో హీరోగా ఉదయ్ శంకర్ నటిస్తున్నాడు. గిఫ్టన్ ఎలియస్ సంగీతమందించాడు. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్ రాజ్, భరత్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: నటి "ఐశ్వర్య"కు జ్వరమొస్తే... రూ.లక్ష బిల్లేశారట!

ABOUT THE AUTHOR

...view details