తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2019, 5:07 PM IST

ETV Bharat / sitara

'మైండ్​ బ్లాక్'​ చేస్తున్న సూపర్​స్టార్ పాట

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్ బ్లాక్' అంటూ సాగే లిరికల్ గీతం సోమవారం విడుదలైంది. ఇందులోని మాస్​ బీట్ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.​

'మైండ్​ బ్లాక్'​ చేస్తున్న సూపర్​స్టార్ పాట
సూపర్​స్టార్ మహేశ్​బాబు

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్​ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు'.. సూపర్​స్టార్ మహేశ్​బాబు​ సినిమాల్లో ఈ డైలాగ్​కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఇందులోని 'మైండ్ బ్లాక్' పదంతో 'సరిలేరు నీకెవ్వరు' కోసం ఏకంగా ఓ పాటనే రూపొందించారు. అందుకు సంబంధించన లిరికల్ గీతాన్ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన మాస్​ బీట్.. శ్రోతల్ని అలరిస్తూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో సూపర్​స్టార్ నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు, అనిల్ సుంకర, మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ అలియా భట్

ABOUT THE AUTHOR

...view details