తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరదల్లో చిక్కుకున్న కేరళ హీరోయిన్ క్షేమం

హిమాచల్​ప్రదేశ్​లో వరదల్లో చిక్కుకున్న మలయాళీ నటి మంజు వారియర్​ సురక్షితంగా బయటపడ్డారు. ఛత్రాలో చిక్కుకుపోయిన 'కథయం పావోలా' చిత్రబృందాన్ని కాపాడిన అధికారులు.. వారిని మనాలీకి తరలించినట్లు తెలిపారు.

By

Published : Aug 20, 2019, 4:22 PM IST

Updated : Sep 27, 2019, 4:19 PM IST

మంజు వారియర్​

హిమాచల్​ వరదల్లో చిక్కుకున్న కేరళ నటి మంజు వారియర్​ను కాపాడారు అక్కడి అధికారులు. మలయాళీ సినిమా 'కథయం పావోలా' చిత్రీకరణలో భాగంగా మనాలీకి 80 కిలోమీటర్ల దూరంలోని ఛత్రాకు వెళ్లారు వారియర్​. ఆమెతో పాటు చిత్ర బృందంలోని 30 మంది వరదల్లో చిక్కుకున్నారు.

హీరోయిన్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్న వారియర్​ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి మురళీధరన్​ను సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. ఆమెను, చిత్రబృందంలోని ఇతర సభ్యులను సురక్షితంగా మనాలీకి తరలించారు.

ఇదీ చూడండి: నీట మునిగిన పురాతన మండి మహాదేవ్​ ఆలయం

Last Updated : Sep 27, 2019, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details