కొంతకాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో ఖరారైపోయంది. సూపర్స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా 'ఎస్ఎస్ఎమ్బీ 28' వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజాహెగ్డేను తీసుకోనున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్తో మహేశ్ 28వ సినిమా ఫిక్స్ - mahesh babu new movie
'సర్కారు వారి పాట' తర్వాత హీరో మహేశ్బాబు నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్స్టార్ సినిమా ఖరారైంది. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
మహేశ్-త్రివిక్రమ్
గతంలో త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు.