తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2019, 7:20 PM IST

Updated : Sep 30, 2019, 9:19 AM IST

ETV Bharat / sitara

జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..!

కథానాయకుడు మహేశ్​బాబు.. నటి విజయశాంతితో 30 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నారు.

హీరో మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ప్రిన్స్.

"అంతా ఇక్కడే మొదలైంది. 1989.. 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా సెట్​లో. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో పనిచేస్తున్నాను. జీవితచక్రానికి ఇదే నిదర్శనం". -ట్విట్టర్​లో హీరో మహేశ్​బాబు

హీరో మహేశ్​బాబు ట్వీట్

'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు సూపర్​స్టార్ కృష్ణ. అందులో మహేశ్​ ద్విపాత్రాభినయం చేశాడు. అతడి తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ఆ సమయంలో ఈ ఫొటో తీశారు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు విజయశాంతి-మహేశ్​ కలిసి నటిస్తున్నారు.

'సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్​గా రష్మిక మందణ్న నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. మహేశ్​బాబుతో కలిసి దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 30, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details