ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్ బాబు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నాడు. కొన్ని రోజుల విరామం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటిస్తాడు. తాజాగా ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ వీడియోను నమ్రత అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మహేశ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.
మహేశ్బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే..
మహేశ్బాబు: అణకువ.. వినయం.. విధేయత
మీ కెరీర్లో లేదా సినిమా సెట్లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన
మహేశ్బాబు: సినిమాలో, సెట్లో అలాంటివి ఏవీ లేవు. అప్పట్లో ప్రతి సినిమా విడుదలైన తర్వాత సుదర్శన్ 35లో నాన్నతో కలిసి చూసేవాడిని. ‘మురారి’ సినిమా చూసిన తర్వాత నాన్న నా భుజంపై చేయి వేసి తట్టారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
మీ ఉద్దేశంలో పర్ఫెక్ట్ రొమాంటిక్ డేట్?
మహేశ్బాబు: నా భార్యతో కలిసి మంచి సినిమా చూడటం.
మిమ్మల్ని చికాకు పెట్టేది ఏంటి?
మహేశ్బాబు: నీతి, నిజాయతీలేని వ్యక్తులు
యువ మహేశ్బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే..