తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2019, 1:45 PM IST

ETV Bharat / sitara

మహేశ్​బాబుతో ముచ్చట్లు పెట్టిన గంగవ్వ

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో, సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. తాజాగా యూట్యూబ్​ స్టార్​ గంగవ్వతో కలిసి ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రూపొందించిందట చిత్రబృందం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

mahesh babu sarileru nekevvaru movie team with gangavva
గంగవ్వతో ముచ్చటకు సిద్ధమైన 'సరిలేరు నీకెవ్వరు' టీం

ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడి, సూపర్ స్టార్​ మహేశ్​బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. మహేశ్​కు జోడీగా రష్మిక నటిస్తోంది. ఇటీవలె విడుదలైన ఈ సినిమా టీజర్​తో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రచారాన్ని పరుగులు పెట్టించే పనిలో పడింది చిత్రబృందం. ఇప్పటికే ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తూ సినీప్రియులను సర్‌ప్రైజ్‌ చేస్తోంది చిత్రబృందం. తాజాగా నెట్టింట సందడి చేసేందుకు గంగవ్వతో కలిసి అనిల్​, మహేశ్​ రంగంలోకి దిగారు. 'మై విలేజ్​ షో' యూట్యూబ్​ ఛానల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది గంగవ్వ.

గంగవ్వతో మహేశ్ బాబు

ఇప్పుడు గంగవ్వ, ఆమె యూట్యూబ్‌ ఛానెల్ బృందంతో ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని తీర్చిదిద్దిందట సరిలేరు నీకెవ్వరు టీం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్​ అవుతున్నాయి. మరి ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? మహేష్‌, విజయ్‌లతో గంగవ్వ చెప్పించిన ముచ్చట్లేంటి అనేవి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

గంగవ్వతో రాజేంద్ర ప్రసాద్​

ఈ మూవీలో విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గంగవ్వతో ముచ్చటకు సిద్ధమైన 'సరిలేరు నీకెవ్వరు' టీం

ఇదీ చదవండి: వద్దన్న రామ్​గోపాల్​ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు

ABOUT THE AUTHOR

...view details