తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 9:07 PM IST

ETV Bharat / sitara

మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్

ట్విట్టర్​లో తన 10 మిలియన్ల ఫాలోవర్ల గురించి మాట్లాడిన హీరో మహేశ్.. వారికి కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవని ట్వీట్ చేశారు.

మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్
మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగానే కాకుండా సోషల్​ మీడియాలోనూ యమ​క్రేజ్​ తెచ్చుకున్నారు. ఇటీవలే ట్విట్టర్​లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ఏ దక్షిణాది నటుడికి సాధ్యమవని రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనను అభిమానిస్తూ అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

"నా మనసులోని కృతజ్ఞతా భావాన్ని మీకు తెలిపేందుకు కోటి ధన్యవాదాలు అయినా సరిపోవు. మీ అందరితో ఇలాంటి వేదిక ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమతో మీ అందరికి ధన్యవాదాలు" అని మహేశ్​బాబు రాసుకొచ్చారు.

ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ వచ్చిన మహేశ్​.. 'సర్కారు వారి పాట'లో నటించనున్నారు. కరోనా కారణంగా ఇంకా షూటింగే ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్.. సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమాలో మహేశ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details