తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"మహర్షి" తేదీ మారింది!

ప్రిన్స్​ మహేశ్​బాబు  మహర్షి చిత్రం వేసవి సెలవుల్లో సందడి చేయనుంది. తొలుత ఏప్రిల్​లో విడుదల చేయాలనుకున్నారు చిత్ర నిర్మాతలు. కొన్ని కారణాల వల్ల  తేదీ మార్చుతున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్​రాజు.

By

Published : Mar 6, 2019, 7:32 PM IST

మే 9న వస్తోన్న మహర్షి చిత్రం

సూపర్ స్టార్ మహేశ్​బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'మహర్షి'. ఏప్రిల్​లో విడుదల కావాల్సిన ఈ సినిమా మే 9వ తేదీకి మారింది. సంబంధిత ప్రకటనను చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్​రాజు వెల్లడించారు. సాంకేతిక కారణాలతోనే ఈ ఆలస్యం జరిగిందని చెప్పారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్​రాజ్

పూజా హెగ్దే హీరోయిన్​గా నటిస్తోంది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేశ్ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ABOUT THE AUTHOR

...view details