తెలంగాణ

telangana

ETV Bharat / sitara

5చోట్ల 'వంద' కొట్టిన మహేశ్​బాబు 'మహర్షి'

మహేశ్​బాబు 'మహర్షి' ఈ శుక్రవారానికి వందరోజులు పూర్తి చేసుకుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానుల మనసు గెల్చుకుంది.

By

Published : Aug 16, 2019, 4:09 PM IST

Updated : Sep 27, 2019, 4:57 AM IST

హీరో మహేశ్​బాబు

ఇప్పట్లో ఓ సినిమా 100 రోజులు ఆడటమనేది చాలా అరుదు. అయితే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సూపర్​స్టార్ మహేశ్​బాబు 'మహర్షి' ఆ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్​లో ఐదు చోట్ల సెంచరీ కొట్టింది. వీటిలో నేరుగా వందల రోజులు ప్రదర్శించబడిన థియేటర్స్ మూడు(వైజాగ్, చిలకలూరిపేట, ఆదోని). మరో రెండు మార్చిన సెంటర్స్.

100 రోజులు పూర్తయిన సందర్భంగా మహర్షి పోస్టర్​

వీకెండ్ అగ్రికల్చర్(వారాంత వ్యవసాయం) అనే కొత్త కథాంశంతో ఈ సినిమా తీశారు. కంపెనీ సీఈఓ, రైతుగా కనిపించి అలరించాడు మహేశ్​బాబు. పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వంశీ పైడిపల్లి దరకత్వం వహించాడు.


ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ మేజర్​ పాత్ర పోషిస్తున్నాడు సూపర్​స్టార్. రష్మిక మందణ్న కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ఆ చిత్రాలతో మియా సంపాదన ఎంతో తెలుసా..!

Last Updated : Sep 27, 2019, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details