తెలంగాణ

telangana

'మహానటి'తో మరోసారి టాలీవుడ్​ భీష్ముడి జోడి!

By

Published : May 12, 2020, 10:27 AM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో నితిన్​తో కలిసి మరోసారి ఆడిపాడనుంది హీరోయిన్​ కీర్తి సురేష్​. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కథానాయికగా ఆమెను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ 'రంగ్​ దే' చిత్రంలో నటిస్తుండగా.. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Mahanati fame Keerthi Suresh once again star with Nitin
మహానటితో మరోసారి టాలీవుడ్​ భీష్ముడు జోడి!

యువ హీరో నితిన్‌తో నటించిన చాలామంది నాయికలు, అతనితో రెండోసారీ ఆడిపాడారు. హిట్టు జోడీ అనిపించుకున్నారు. అలా మరోసారి నితిన్‌ - కీర్తి సురేష్‌ కలిసి నటించే అవకాశాలున్నట్లు సమాచారం. వీరిద్దరూ ప్రస్తుతం 'రంగ్‌దే'లో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్‌ 'పవర్‌ పేట' అనే చిత్రం చేయబోతున్నాడు. అందులో కథానాయికగా కీర్తిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

'రంగ్​ దే' సినిమా ఫస్ట్​లుక్​

నితిన్​ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'పవర్‌ పేట' అనే చిత్రంలో మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు. 'అంధాధున్‌' రీమేక్‌ను ఇటీవలే పట్టాలెక్కించాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌ అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్‌ యేలేటితో ఓ చిత్రం చేస్తున్నాడీ యువహీరో. ఈ మూవీకి 'చెక్‌' అనే టైటిల్​ను​ చిత్రబృందం పరిశీలిస్తోంది.

ఇదీ చూడండి.. కరోనాను లెక్కచేయని నాని- మరో చిత్రానికి గ్రీన్​ సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details