'వినరా సోదరా' సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ సాయి.. 'మథనం' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హైదరాబాద్లో సోమవారం టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు సురేందర్రెడ్డి హాజరయ్యాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించాడు.
ఈ సినిమాతో డాన్సర్ అజయ్ సాయి మణికందన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భావన హీరోయిన్. అశోక్ ప్రసాద్, దివ్య ప్రసాద్ నిర్మాతలు. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతమందించిన రాన్ ఎహాన్ స్వరాలు సమకూర్చాడు.