తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాంకేతికత అందుబాటులో లేకపోవడం మాకు వరం'

ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్, చిత్రలతో హైదరాబాద్​లో 'లెజెండ్స్​' పేరుతో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. రేపు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా బాలు, ఏసుదాస్, చిత్ర పలు విషయాలను పంచుకున్నారు.

By

Published : Nov 29, 2019, 7:36 AM IST

legends
బాలు

"మనం ఏం పాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటే మేం ఇన్నేళ్లుగా ఉండేవాళ్లం కాదు. ఓ పాట పూర్తయ్యాకే కాదు, ఓ కచేరీ అయిన తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకుంటాం" అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. ఈనెల 30న హైదరాబాద్‌లో 'లెజెండ్స్‌ పేరుతో ఓ సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఏసుదాస్‌, చిత్రలతో పాటు బాలు తన గాన మాధుర్యాన్ని పంచబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలు మాట్లాడారు.

"మేం పాడిన వేలాది పాటల్లో ఏ పాటలు పాడాలో ఎంచుకోవడం కష్టం అయ్యింది. ఇద్దరు ఉద్దండులతో ఈసారి వేదిక పంచుకుంటున్నాను. ఏసుదాసు అనగానే సంప్రదాయ గీతాలు గుర్తొస్తాయి. ఆ గీతాలలో భక్తి మిళతమై ఉంటుంది. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం మాకు వరం. ఓ పాట కోసం గంటల కొద్దీ సాధన చేసేవాళ్లం. దానివల్ల మా గాత్రం మెరుగైంది. ఇప్పటి పిల్లలకు పాట పాడడం సుఖంగా ఉంది. తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంది. సాంకేతిక ఉపయోగించుకోండి. తప్పులేదు. కానీ పాటని ఒక్కసారైనా మనసారా పాడండి "
-బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు

ఏసుదాస్‌ మాట్లాడుతూ "భయమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పటికీ రోజూ సాధన చేస్తుంటాను. భక్తితో, వినయంతో పాడినప్పుడే సంగీతం రక్తి కడుతుంది" అన్నారు. చిత్ర మాట్లాడుతూ "ఇంత పెద్ద కార్యక్రమంలో పాడడం కొంచెం భయంగానే ఉంది. అయితే దానికి తగిన సాధన చేశాను. అందరినీ అలరిస్తామనే నమ్మకం ఉంది" అన్నారు.

ఇవీ చూడండి.. 'మేజర్' కోసం.. జిమ్​లో కసరత్తులు చేస్తోన్న శేష్​​

ABOUT THE AUTHOR

...view details