తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అట్టహాసంగా 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో జరిగిన 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, చిత్ర తమ పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.

By

Published : Dec 1, 2019, 7:38 AM IST

Legends Live
లైవ్ లెజెండ్స్

ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి అలరించింది. ఈ కార్యకమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు గాయని సునీత, పలువురు సినీ గాయ‌కులు పాల్గొన్నారు.

ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో జరిగిన సంగీత సంగ్రామం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల‌ నుంచి 20 మంది వాద్యకారులు పాల్గొన్నారు. అభిమానులూ భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ మాట్లాడారు. తనకు పాటలంటే ఎంతో ఇష్టమని.. ఈ ముగ్గురూ సంగీతానికి దేవుడిచ్చిన వరమని అన్నారు.

ఇవీ చూడండి.. అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!

ABOUT THE AUTHOR

...view details