తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్ 'లక్ష్మీ బాంబ్​' పేలేది ఆ రోజే - bollywood

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​, కియారా అడ్వాణీ నీ జంటగా నటిస్తోన్న 'లక్షీబాంబ్' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం​. 2020 మే 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

అక్షయ్

By

Published : Aug 27, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 10:11 AM IST

ఈ సారి ఈద్‌ కానుకగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు 'లక్ష్మీబాంబ్‌'ను కానుకగా అందివ్వబోతున్నాడు అక్షయ్‌ కుమార్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అడ్వాణీ కథానాయిక.

దక్షిణాదిలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'కాంచన'కు హిందీ రీమేక్‌ ఇది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని రంజాన్‌ కానుకగా 2020 మే 22న విడుదల చేయనున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్​ పూర్తయిందని, కామెడీ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. తుషార్‌ కపూర్, షబీనా ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సల్మాన్ ఖాన్​ హీరోగా సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇన్షాల్లా' ఈద్​కే రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఈ చిత్రం పండగ పోటీ​ నుంచి తప్పుకుంది. ఈ సినిమా ఆలస్యమైనా మరో చిత్రంతో ఈద్​కు వస్తానని సల్మాన్ తెలిపాడు. తాజాగా ఈ బాలీవుడ్​ కండలవీరుడు నటిస్తోన్న 'కిక్​ 2'ను రంజాన్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇవీ చూడండి.. ప్రియుడితో ఇలియానా బ్రేకప్​...!

Last Updated : Sep 28, 2019, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details