తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ తర్వాత రొమాన్స్ సీన్లకు దూరం! - లాక్​డౌన్​ తర్వాత ఆ సన్నివేశాలకు దూరంగా ఉంటా

లాక్​డౌన్​ తర్వాత సినిమా షూటింగ్​లలో రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉంటానని తెలిపింది 'అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాఠి. భౌతిక దూరం తప్పకుండా పాటిస్తానని వెల్లడించింది.

lavanya tripathi
లావణ్య త్రిపాఠి

By

Published : May 26, 2020, 4:49 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన 'అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాఠి.. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ తర్వాత రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

లావణ్య త్రిపాఠి

"లాక్‌డౌన్‌ అనంతరం షూటింగ్‌లు మొదలైనప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. సెట్స్‌లో అయితే భద్రతకే మొదటి ప్రాధాన్యం. నేను, నాతో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ చేయడం అనేది పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాం. ఇక రొమాంటిక్‌ సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా"

-లావణ్య త్రిపాఠి, కథానాయకురాలు.

గతేడాది 'అర్జున్‌ సురవరం' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న లావణ్య.. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌', 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి : ముచ్చటగా మూడు సీక్వెల్స్​తో గౌతమ్​మేనన్​

For All Latest Updates

TAGGED:

lavanya

ABOUT THE AUTHOR

...view details