తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి' - ప్రముఖ గాయని లతా మంగేష్కర్​

మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్​. ఆరే సబర్బన్​ ప్రాంతంలో చెట్ల నరికివేతకు ఆదేశాలివ్వడంపై విమర్శలు గుప్పించారు. వాటిని రక్షించి నగరాన్ని పచ్చగా ఉంచాలని కోరారు.

'ఆరే చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి'

By

Published : Sep 4, 2019, 6:39 PM IST

Updated : Sep 29, 2019, 10:50 AM IST

మెట్రో కార్​షెడ్​ ఏర్పాటులో భాగంగా ఆరే స​బర్బన్​ ప్రాంతంలో దాదాపు 2,700 చెట్లను నరికేందుకు ఆదేశాలిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్​. చెట్లను కాపాడాల్సిన బాధ్యతనుప్రభుత్వం విస్మరిస్తోందని ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

" 2,700 చెట్లను తొలగించి ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నారా? దీని వల్ల వేలాది పక్షులు, జంతువుల జీవనం దెబ్బతింటుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచన చేయాలి. అడవిని సంరక్షించాలి". -లతా మంగేష్కర్​, గాయని

ఆరే కాలనీ నుంచి గోరేగాన్ ప్రాంతాన్ని కలుపుతూ మెట్రో కార్​షెడ్​ వేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది బ్రిహన్​ ముంబయి మున్సిపల్​ కార్పోరేషన్​ (బీఎమ్​సీ). ఈ ప్రాంతం నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఉపయోగపడుతోందని, అందుకే చెట్లను కాపాడాలని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరే అటవీ ప్రాంతాన్ని రక్షించాలని పర్యావరణ ప్రేమికులు ఇటీవల నిరసన చేపట్టారు. బాలీవుడ్​ నటి శ్రద్ధా కపూర్వీరితో కలిసింది. బీఎమ్​సీ నిర్ణయం హాస్యాస్పదమని అభివర్ణించింది. దియా మీర్జా, రవీనా టాండన్​, రణ్​దీప్​ హుడా, ఇషా గుప్తా, కపిల్​ శర్మ వంటి నటీనటులు ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు.

ఇదీ చదవండి..అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?

Last Updated : Sep 29, 2019, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details