తెలంగాణ

telangana

lata mangeshkar: 'లతా మంగేష్కర్ గానం అజరామరం'

By

Published : Feb 6, 2022, 11:52 AM IST

Updated : Feb 6, 2022, 1:20 PM IST

Lata Mangeshkar: లతా మంగేష్కర్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు సినీ ప్రముఖుల. ఆమె లేని లోటు తీర్చలేనిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లత.. భారతీయ సంగీతానికి నిర్వచణమని మహేశ్ ట్వీట్ చేశారు.

lata mangeshkar
mahesh babu

Lata Mangeshkar: దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీప్రముఖులు. ఆమె మరణం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు సూపర్​స్టార్ మహేశ్ బాబు. ఆమె గానం ఎప్పటికీ బతికే ఉంటుందని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు.

నైటింగేల్​ ఆఫ్ ఇండియా, దిగ్గజాల్లో ఒకరు.. లతా మంగేష్కర్ ఇకలేరు. ఆమె మహోన్నతమైన జీవితాన్ని గడిపారు. ఆమె గానం ఎప్పటికీ బతికే ఉంటుంది. సంగీతం ఉన్నంతవరకు ఆమెను గుర్తుచేసుకుంటారు.

- చిరంజీవి, నటుడు

భారతీయ సంగీతానికి నిర్వచనం..

"లతా మంగేష్కర్​ మరణం కలచివేసింది. భారతీయ సంగీతానికి నిర్వచణం లతాజీ. ఆమె వారసత్వం అసమానమైనది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు."

- మహేశ్ బాబు, నటుడు

ఆమె పాడటం నా అదృష్టం..

లతా మంగేష్కర్​ చాలా పెద్ద ఆర్టిస్ట్​. ఆమె పాడిన ఎన్నో హిట్​ పాటలకు పెర్​ఫార్మ్​ చేయడం నా అదృష్టం. ఆమె ఎంతో ప్రత్యేకం. ఆమెలా ఎవరూ పాడలేరు. ఆమె వెళ్లిపోవడం బాధగా ఉంది.

- హేమా మాలిని, నటి

లతా మంగేష్కర్‌ మరణం పట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ సంతాపం తెలియజేశారు. ఆమె లేకపోవడం దేశానికి తీరని లోటని అన్నారు. మధురగాత్ర మహారాణి లత అని చెప్పారు. కొత్త తరం గాయకులకు లత స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.

బాలకృష్ణ నోట్

ఇవీ చూడండి:

లతకు ప్రముఖుల ఘన నివాళి- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

లతా మంగేష్కర్ పాడటం.. సంగీత దర్శకులకు గౌరవం

Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

Last Updated : Feb 6, 2022, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details