తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్షీరసాగర మథనం' విలన్​ను పరిచయం చేసిన అడవి శేషు - ksheera sagara mathanam

విబ్​జియార్ కాన్సెప్ట్​తో టాలీవుడ్​లో వస్తోన్న చిత్రం 'క్షీరసాగర మథనం'. తాజాగా ఈ సినిమాలోని విలన్ క్యారక్టర్​ పోస్టర్​ను యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు.

ksheera sagara mathanam
సినిమా

By

Published : Nov 30, 2019, 10:33 AM IST

నూతన దర్శకుడు అనిల్ పంగలూరి తెరకెక్కిస్తున్న వైవిధ్యభరిత చిత్రం 'క్షీరసాగర మథనం'. విబ్ జియార్ కాన్సెప్ట్​తో నూతననటీలతో రూపొందుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే చిత్ర యూనిట్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా పేరును యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించగా తాజాగా ఈ చిత్రంలో విలన్​గా నటిస్తున్న ప్రదీప్ రుద్ర పోస్టర్​ను మరో యువ హీరో అడవి శేషు విడుదల చేశాడు. ప్రదీప్ ఈ చిత్రంలో బాబర్ ఆజమ్ పాత్రలో విలన్​గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా ఫ్రిబవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోస్టర్ విడుదల చేస్తోన్న శేషు

ఇవీ చూడండి.. దీపికకు నేను సవతిని: అర్జున్ కపూర్

ABOUT THE AUTHOR

...view details