తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 8:11 AM IST

Updated : Aug 8, 2020, 10:37 AM IST

ETV Bharat / sitara

కేరళ విమాన ప్రమాదం: టాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి

కేరళ విమాన ప్రమాదంపై బాధపడ్డ టాలీవుడ్​, బాలీవుడ్​ ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేరళ విమాన ప్రమాదం: టాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
కేరళ కొజికోడ్ విమాన ప్రమాదం

కేరళ కొజికోడ్​లో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్​కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇదే విషయమై పోస్టులు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిలో అల్లు అర్జున్, అల్లరి నరేశ్, సుధీర్​బాబు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్, ఈషా రెబ్బా, నిధి అగర్వాల్, వరుణ్ తేజ్, రాశీఖన్నా, సుశాంత్, కీర్తి సురేశ్, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ తదితరులు ఉన్నారు.

"కొజికోడ్​లో జరిగిన ఈ ఘటనతో షాకయ్యా. మృతి చెందిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" -అల్లు అర్జున్, కథానాయకుడు

"ఈ ప్రమాదం హార్ట్ బ్రేకింగ్, చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" -దేవిశ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు

"కొజికోడ్​ ప్రమాదం చాలా బాధాకరం, నాకు మాటలు రావట్లేదు. మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" -అల్లరి నరేశ్, ప్రముఖ హీరో

వీరితో పాటు బాలీవుడ్​కు చెందిన అక్షయ్ కుమార్, ప్రీతి జింటా, అజయ్ దేవగణ్, శ్రద్ధా కపూర్ తదితరులు విమాన ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Last Updated : Aug 8, 2020, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details