బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఇందూ కీ జవానీ'. సోమవారం తన పాత్రకు సంబంధించిన టీజర్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది కియారా. బెంగాలీ దర్శకుడు అబీర్ సేన్గుప్తా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆన్లైన్ యాప్ డేటింగ్ లవ్ స్టోరీ నేపథ్యంలో కథ సాగనుంది.
అలరిస్తోన్న కియారా 'ఇందూ కీ జవానీ' టీజర్ - కియారా అద్వాని సినిమా
కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఇందూ కీ జవానీ' చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఆమె పాత్రకు సంబంధించిన టీజర్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుందీ నటి.
కియారా అద్వాని
'ఇందూ కీ జవానీ' చిత్రానికి మోనిషా అడ్వాణీ, నిఖిల్ అడ్వాణీలతో సహా మధు భోజ్వానీ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నిరంజన్ అయ్యంగార్, ర్యాన్ స్టీఫెన్ సహ నిర్మాతలు.