తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్​-2' నుంచి సూపర్​ అప్డేట్​.. కమల్​ 'విక్రమ్​' షూటింగ్ పూర్తి - ఆడవాళ్లు మీకు జోహార్లు తాజా వార్తలు

KGF 2 Release Date: కేజీఎఫ్-2 నుంచి అదిరిపోయే అప్డేట్ గురువారం రానుంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్​ నటిస్తున్న 'విక్రమ్' చిత్రం షూటింగ్ పూర్తయింది.

KGF 2 Release Date
కేజీఎఫ్

By

Published : Mar 2, 2022, 9:57 PM IST

KGF 2 Release Date: 2018లో విడుదలైన 'కేజీఎఫ్' తొలి భాగం.. దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. కేజీఎఫ్​ పార్ట్​ 2ను ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్​ వచ్చింది. ఆ వివరాల్ని మార్చి3న చెప్తామని కేజీఎఫ్​ చిత్రబృందం వెల్లడించింది. మరి ఆ అప్డేట్​ విశేషాలేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.

తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

విక్రమ్ షూటింగ్​ పూర్తి..

Vikram Movie Release Date: లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్​ నటిస్తున్న 'విక్రమ్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా, ఫహాద్ ఫాజిల్​ కీలకపాత్రలో నటిస్తున్నారు.

మేకింగ్ వీడియో ఫుల్ ఫన్..

Aadavallu Meeku Joharlu Release Date: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల రానుంది.

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"మంచి కథతో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యముంది. శర్వా, రష్మికల జంటకు మంచి మార్కులు పడతాయి" అని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు.

ఇదీ చూడండి:'పొన్నియన్​ సెల్వన్'లో యుద్ధ వీరుడిలా విక్రమ్​.. మెరిసిన ఐశ్వర్య, త్రిష​

ABOUT THE AUTHOR

...view details