తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2020, 1:39 PM IST

Updated : Mar 17, 2020, 4:16 PM IST

ETV Bharat / sitara

అక్షయ్ 'పృథ్వీరాజ్​' బృందానికి కర్ణిసేన వార్నింగ్!

బాలీవుడ్ హీరో అక్షయ్​కుమార్​ నటిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రీకరణను కర్ణిసేన అడ్డుకుంది. ఈ సినిమాను చరిత్రకు అనుగుణంగానే తీయాలని చిత్రబృందానికి స్పష్టం చేసింది.

Karnisena who blocked Akshay movie Prithviraj after Padmaavat
అక్షయ్ 'పృథ్వీరాజ్​'కు కర్నిసేన నుంచి వార్నింగ్!

బాలీవుడ్​లో గతేడాది వచ్చిన​ 'పద్మావత్​' విడుదల విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో తెలిసిందే. చరిత్రను వక్రీకరించి ఈ చిత్రాన్ని తీశారంటూ కర్ణిసేన సినిమా విడుదలను అడ్డుకుంది. మళ్లీ ఇప్పుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న 'పృథ్వీరాజ్'​కు కర్ణిసేన నిరసన సెగ తగిలింది. రాజస్థాన్​లో జైపుర్​ దగ్గర శనివారం షూటింగ్​ జరుగుతుండగా అడ్డుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.

అయితే కర్ణిసేనతో మాట్లాడిన దర్శకుడు చంద్రప్రకాశ్.. తాను పృథ్వీరాజ్​ చరిత్రలో మార్పులేం చేయకుండానే సినిమా తీస్తున్నానని చెప్పాడు. కానీ ఈ విషయంలో తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కర్ణిసేన కోరింది. దీనికి అంగీకరిస్తేనే షూటింగ్ జరుగుతుందని తెలిపింది.

'పృథ్వీరాజ్​' పోస్టర్​

'పృథ్వీరాజ్​' సినిమా రాజ్​పుత్​ వంశస్థుడైన పృథ్వీరాజ్​ చౌహాన్​ జీవితం ఆధారంగా తీస్తున్నారు. యశ్​రాజ్​ ఫిలింస్​ నిర్మిస్తోంది. చంద్రప్రకాశ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తోంది.

ఇదీ చూడండి.. రానా-త్రిష మళ్లీ ప్రేమలో పడ్డారా?

Last Updated : Mar 17, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details