బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ 'తఖ్త్' పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులు గడుస్తుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ చిత్రం సెట్లోకి అడుగుపెట్టకముందే రద్దయినట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబ్, అతడి సోదరుడు దాారాషుకో మధ్య సింహాసనం కోసం జరిగిన పోరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు కరణ్. దారా పాత్రలో రణ్వీర్ సింగ్, ఔరంగజేబ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఆలియా భట్, కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది.