తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2019, 2:30 PM IST

ETV Bharat / sitara

'యాక్షన్ డ్రామా'లో కంగనా రనౌత్

కంగనా రనౌత్ తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసింది. పూర్తి స్థాయి యాక్షన్​ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుపుకుంటోంది.

తన దర్శకత్వంలో రానున్న యాక్షన్ డ్రామాలో ప్రధాన పాత్రలో కనిపించనున్న కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ అంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవలే 'మణికర్ణిక'లో నటనతో పాటు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించనుంది. పూర్తి యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండనుందని ఆమె తెలిపింది.

'ప్రస్తుతం తర్వాతి సినిమా పనిలో బిజీగా ఉన్నాను. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందీ చిత్రం. దాని పనులన్నింటినీ ఓ వరుస క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం. స్క్రిప్ట్​ వర్క్​ సిద్ధమైంది. త్వరలో ఫొటోషూట్ చేస్తాం. తర్వాత పోస్టర్​ను విడుదల చేస్తాం' -కంగనా రనౌత్, హీరోయిన్

ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'పంగా' సినిమా షూటింగ్ మంగళవారమే పూర్తయింది. ఇది కాకుండా రాజ్​కుమార్​ రావ్​తో కలిసి 'మెంటల్ హై క్యా', జయలలిత బయోపిక్ 'తలైవి'​లోనూ నటిస్తోంది.

ఇది చదవండి: నా బయోపిక్ నేనే ​ తీస్తా... అంటున్న కంగనా రనౌత్

ABOUT THE AUTHOR

...view details