తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కూల్చిన బిల్డింగ్​లోనే పనిచేస్తా.. డబ్బుల్లేవ్: కంగన

తన దగ్గర తగినంత డబ్బు లేదని, అందుకే శిధిలాల మధ్యే పనిచేస్తానని నటి కంగన చెప్పింది. ముంబయిలోని ఈమె భవంతి కూల్చివేతపై ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది.

By

Published : Sep 11, 2020, 10:19 AM IST

Updated : Sep 11, 2020, 11:35 AM IST

కూల్చిన బిల్డింగ్​లోనే పనిచేస్తాను: కంగన
నటి కంగనా రనౌత్

కూల్చివేసిన భవనాన్ని తిరిగి కట్టుకునేంత స్థోమత తనకు లేదని చెప్పింది నటి కంగనా రనౌత్. కాబట్టి ఆ శిథిలాల మధ్యే పనిచేస్తానని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ముంబయిలోని ఈమె కార్యాలయాన్ని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం కొంతమేర కూల్చివేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన పార్టీపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే Kangana Vs Uddhav అని ట్వీట్‌ కూడా పెట్టింది.

'ఈ ఏడాది జనవరి 15న ముంబయిలో నా కార్యాలయాన్ని ఆరంభించాను. తర్వాత కొంత కాలానికే కరోనా వల్ల అందరిలాగానే నేను కూడా వృత్తిపరంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు ఈ ధ్వంసమైన భవనాన్ని తిరిగి చక్కదిద్దడానికి నా దగ్గర డబ్బుల్లేవు. కాబట్టి నేను ఈ శిథిలాల నుంచే పని చేస్తాను. ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలనుకునే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుంది' -కంగన రనౌత్, ప్రముఖ కథానాయిక

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి తర్వాత హిందీ చిత్రసీమలోని పెద్దలపై కంగన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఆమె ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్​తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. దీంతో శివసేన పార్టీ, కంగన మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది. ఇదే సమయంలో ముంబయిలోని కంగన కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ, బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించగా.. ఆ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.

ఇదీ చదవండి:

Last Updated : Sep 11, 2020, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details