తెలంగాణ

telangana

పరువునష్టం కేసులో కంగనకు సమన్లు

By

Published : Jan 21, 2021, 10:49 AM IST

స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. గేయ రచయిత జావేద్​ అక్తర్​ నమోదు చేసిన పరువునష్టం దావా కేసులో శుక్రవారం విచారించేందుకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందజేశారు.

Mumbai police summon Kangana in Javed Akhtar defamation case
పరువునష్టం కేసులో కంగన రనౌత్​కు సమన్లు

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ప్రముఖ గేయ రచయిత జావేద్​ అక్తర్​ నమోదు చేసిన పరువునష్టం కేసులో భాగంగా శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందజేశారు.

ఏం జరిగిందంటే?

ఓ ఇంటర్వ్యూలో నటి కంగన మాట్లాడుతూ తన పేరు ప్రస్తావించి.. తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్​ అక్తర్ గతేడాది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ‌ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 1 లోపు కంగనను విచారించేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన 'తాండవ్​'- ఆ సీన్స్​ డిలీట్​!

ABOUT THE AUTHOR

...view details