తెలంగాణ

telangana

కంగనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇదే!

By

Published : Oct 5, 2020, 4:28 PM IST

ప్రపంచంలో ఎన్ని అద్భుత ప్రదేశాలున్నా.. షూటింగ్ సెట్​లో మాత్రమే తనకు సౌకర్యంగా ఉంటుందని నటి కంగనా రనౌత్ చెప్పింది. తాజాగా సెట్​లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

Kangana
కంగనా

బాలీవుడ్​ బ్యూటీ కంగనా ర‌నౌత్.. దాదాపు ఆరు నెల‌ల విరామం త‌ర్వాత ఇటీవలే 'తలైవి' చిత్రీకరణలో పాల్గొంది. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్‌తో కలిసి దిగిన ఫోటోల‌ను ట్వీట్ చేసింది. ఓ సన్నివేశానికి సంబంధించి తామిద్దరం చర్చించుకున్నట్లు తెలిపింది.

"గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న ఉద‌యం ఓ సన్నివేశం గురించి చర్చించుకున్నప్పుడు దిగిన ఫోటోస్ ఇవి. ప్ర‌పంచంలో అత్యద్భుత‌మైన ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. కాని నేను మాత్రం సౌకర్యంగా ఉండేది, ఇష్టపడేది మూవీ సెట్​లోనే" అని కంగన ట్వీట్ చేసింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ‌ల‌లిత జీవితాధారంగా తెరకెక్కుతోంది 'తలైవి' . ఇందులో టైటిల్​ రోల్​ పోషిస్తోంది కంగన. జ‌య‌ల‌లిత జీవితంలోని కీల‌క వ్యక్తులు ఎం.జి.రామచంద్రన్ పాత్ర‌లో అరవింద్‌ స్వామి, మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో వచ్చే ఏడాది విడుద‌ల కానుంది.

ఇదీ చూడండి హీరోయిన్ మిస్తీ​ చనిపోయిందని పొరపాటు!

ABOUT THE AUTHOR

...view details