తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఏక్‌ విలన్‌ 2' కోసం ఆ ఇద్దరు! - మలంగ్

బాలీవుడ్ హిట్​ సినిమా ఏక్ విలన్​కు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఇందులో జాన్ అబ్రహం, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధానపాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

john abraham
ఏక్‌ విలన్‌ 2

By

Published : Jan 6, 2020, 6:39 PM IST

సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్​ జంటగా నటించిన చిత్రం 'ఏక్‌ విలన్‌'. 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్​గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు మోహిత్​ సూరి. హీరో జాన్‌ అబ్రహంను సంప్రదించాడని సమాచారం. ఇందులో మరో పాత్రలో ఆదిత్య రాయ్‌ కపూర్ నటించనున్నాడట.

ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్, ఏక్తా కపూర్ సంయక్తంగా నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జాన్‌ అబ్రహం ప్రస్తుతం.. 'సత్యమేవ జయతే 2'లో నటిస్తుండగా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ 'సఢక్ 2, మలంగ్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

ఇవీ చూడండి.. ఆమె జీవిత కథ విని హీరో సూర్య కన్నీటి పర్యంతం

ABOUT THE AUTHOR

...view details