తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2020, 2:29 PM IST

Updated : Jul 30, 2020, 2:38 PM IST

ETV Bharat / sitara

తారక్-త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ కపూర్!

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దక్షిణాదిలో అవకాశం వస్తే నటిస్తానని ఎపుడూ చెబుతూ ఉంటుంది. తాజాగా తారక్-త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ హీరోయిన్​గా నటించనుందని సమాచారం.

తారక్-త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ కపూర్!
తారక్-త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ కపూర్!

దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ దక్షిణాదిలో అవకాశం వస్తే నటిస్తానని చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. తాజాగా ఓ కథానాయిక పాత్ర కోసం జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

గతంలో సమంత, పూజాహెగ్డే, రష్మిక లాంటి కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. మొత్తం మీద ఈ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి 'దోస్తానా 2' చిత్రంలో నటిస్తోంది.

Last Updated : Jul 30, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details