బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లు మూతపడిన కారణంగా ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
"మొట్టమొదటి భారత మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది. ఆమె జీవితం నాకు స్ఫూర్తిగా నిలిచింది. మీకు కూడా స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నా. 'గుంజన్ సక్సేనా' ఆగస్టు 12న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుంది."