తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాన్వీ కపూర్​పై ట్రోల్స్​.. ఏమైందంటే!​ - jhanvi kapoor

దేశరాజధానిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిన్న పొరపాటు చేసిన హీరోయిన్​ జాన్వీ కపూర్.. ట్రోలింగ్​కు గురైంది.

పుస్తకం తిప్పి పట్టుకున్న హీరోయిన్​ జాన్వీ కపూర్

By

Published : Aug 25, 2019, 8:01 AM IST

Updated : Sep 28, 2019, 4:37 AM IST

న్యూదిల్లీలో జరిగిన 'కాలింగ్ షెహ్మత్' పుస్కకావిష్కరణ కార్యక్రమానికి హాజరైంది హీరోయిన్​ జాన్వీ కపూర్. అందులో చేసిన చిన్న పొరపాటు కారణంగా ట్రోలింగ్​కు గురైంది.

ఇంతకీ జరిగిందేమిటి..?
ప్రముఖ రచయత హరీందర్ సిక్కా రచించిన 'కాలింగ్ షెహ్మత్' (హిందీ) పుస్తకావిష్కరణలో పాల్గొన్న హీరోయిన్​ జాన్వీ కపూర్.. తనకిచ్చిన బుక్​ను వ్యతిరేక దిశలో పట్టుకుంది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని సరిచేసింది. అప్పటికే ఆ ఫొటోలు వైరల్​ అవడం వల్ల నెటిజన్ల చేతిలో ట్రోలింగ్​కు గురైంది.

పుస్తకం తిప్పి పట్టుకున్న హీరోయిన్​ జాన్వీ కపూర్
అనంతరం సరిచేసి పుస్తకం పట్టుకున్న జాన్వీ కపూర్

భారతీయ గూఢచారిగా పనిచేసే ఓ కశ్మీర్ బాలిక జీవితమే ఈ పుస్తకంలోని కథాంశం. బాలీవుడ్​లో ఈ నవల ఆధారంగానే 'రాజీ' సినిమా వచ్చింది. అలియా భట్, విక్కీ కౌశల్ హీరో హీరోయిన్లుగా నటించారు.

'రూహ్-అఫ్జా' టైటిల్​తో రూపొందుతున్న హారర్ కామెడీలో నటిస్తోంది హీరోయిన్​ జాన్వీ కపూర్. రాజ్​కుమార్​ రావ్​ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదే కాకుండా భారత వాయుసేన ఫైలట్​ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో గుంజన్ పాత్రలో నటిస్తోంది జాన్వీ. అదే విధంగా కరణ్​ జోహార్ తీస్తున్న 'తఖ్త్'లోనూ ఓ విభిన్న పాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. లాస్ట్​ స్టోరీస్​కు కొనసాగింపుగా వస్తోన్న ఘోస్ట్​ స్టోరీస్​ అనే వెబ్​ సిరీస్​లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇది చదవండి: బెల్లీ డ్యాన్స్​తో అదరగొడుతున్న జాన్వీ కపూర్

Last Updated : Sep 28, 2019, 4:37 AM IST

ABOUT THE AUTHOR

...view details