తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 7:12 AM IST

ETV Bharat / sitara

రూ.70 కోట్లకు జాన్వీ కపూర్ సినిమా!

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ నటించిన 'గుంజన్ సక్సేనా'ను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూ.70 కోట్లకు జాన్వీ కపూర్ సినిమా!
జాన్వీ కపూర్

బాలీవుడ్​ ఓటీటీ బాటపట్టింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబో'.. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'.. నెట్​ఫ్లిక్స్​లో రానుంది. అయితే ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మినట్లు సమాచారం. ఏకంగా రూ.70 కోట్లు పెట్టి దీనిని కొనుగోలు చేసిందట సదరు సంస్థ.

'గుంజన్ సక్సేనా' సినిమాలో జాన్వీ కపూర్

కార్గిల్ యుద్ధంలో పోరాడిన తొలి మహిళా యుద్ధ పైలెట్​ గుంజన్ సక్సేనా జీవిత కథతో ఈ సినిమా తీశారు. దీంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ శర్మ దర్శకుడు.

"తక్కువ బడ్జెట్​తో తీసిన 'గులాబో సితాబో'ను సుమారు రూ.65 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. 'గుంజన్..'ను రూ.25-30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి ఇంత ధర రావడం నిర్మాత కరణో జోహార్​కు బాగా కలిసొచ్చింది. తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ఫామ్స్​లో విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు మంచిగా ఆర్జించే అవకాశముంటుంది" అని అన్నారు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు.

ABOUT THE AUTHOR

...view details