టాలీవుడ్ ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని.. ఇప్పటికే బుల్లితెరపై సందడి చేశారు. ఇప్పుడీ జాబితాలోకి జగపతి బాబు చేరబోతున్నాడని సమాచారం. ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించనున్న కార్యక్రమానికి జగ్గూభాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే జగపతితో చర్చలు సాగాయని, అతడు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయని టాక్. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
బుల్లితెరపై సందడికి జగపతిబాబు సిద్ధం! - జగపతి బాబు మూవీ అప్డేట్స్
టాలీవుడ్లో హీరోగా పరిచయమై.. విలక్షణ పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు జగపతి బాబు. తాజాగా బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతడు వ్యాఖ్యాతగా రాబోతున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
![బుల్లితెరపై సందడికి జగపతిబాబు సిద్ధం! Jagapathi Babu as host in a TV Show](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6352902-203-6352902-1583764325643.jpg)
బుల్లితెరపై సందడి చేయనున్న జగపతిబాబు!
సహజ నటనతో అటు హీరోగా, ఇటు విలన్గా వెండితెరపై తనదైన ముద్ర వేశాడు జగపతిబాబు. ఇప్పుడు బుల్లితెరపై ఎలా అలరిస్తాడో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న 'మిస్ ఇండియా' చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ఓ వెబ్ సిరీస్లోనూ కనువిందు చేయనున్నాడు.
ఇదీ చూడండి..'ఊపిరి మొత్తం ఉప్పెన అయితే ధక్ ధక్ ధక్'