తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి థియేటర్లలోకి 'ఇస్మార్ట్ శంకర్'

దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఇస్మార్ట్ శంకర్'. ఈ విషయాన్ని నిర్మాత ఛార్మీ ట్విట్టర్​లో వెల్లడించింది.

By

Published : Sep 25, 2019, 10:36 PM IST

Updated : Oct 2, 2019, 12:54 AM IST

ఇస్మార్ట్ శంకర్ సినిమా

చాక్లెట్​ బాయ్ రామ్ మాస్​ పాత్రలో అలరించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ ట్విట్టర్​లో వెల్లడించింది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా నభా నటేశ్, నిధి అగర్వాల్ నటించారు. మణిశర్మ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇటీవలే యూట్యూబ్​లో విడుదలైన 'దిమాఖ్ కరాబ్', 'ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్' ఇందుకు నిదర్శనం.

చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్​కు ఈ చిత్రంతో బ్లాక్​బస్టర్​ దక్కింది. ప్రస్తుతం విజయ్​ దేవరకొండతో సినిమా తీస్తున్నాడీ డైరెక్టర్. 'ఫైటర్​' అనే పేరు పరిశీలనలో ఉంది.

ఇది చదవండి: 'ఈద్​'కు వస్తోన్న సల్మాన్​​.. దర్శకుడు అతడే..!

Last Updated : Oct 2, 2019, 12:54 AM IST

ABOUT THE AUTHOR

...view details