తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 5:49 PM IST

ETV Bharat / sitara

'ధూమ్‌' తరహాలో నాని, సుధీర్​ల 'వి'..!

నాని, సుధీర్​బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'వి'. ఈ సినిమాలో నాని విలన్​గా కనిపించనున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

dhoom
నాని

'ధూమ్‌' పరిచయం అవసరం లేని హిందీ చిత్రం. ఇందులో విలనిజానికే ప్రాధాన్యత ఎక్కువ. కథ మొత్తం విలన్‌ చుట్టూ నడుస్తుంటుంది. ఆ పాత్రకు అంతటి డిమాండ్‌ ఉంది కాబట్టే అగ్ర కథానాయకులూ ప్రతినాయకులుగా మారారు. మూడు సిరీసుల్లో వచ్చిన 'ధూమ్‌' తొలి భాగంలో జాన్‌ అబ్రహం, రెండో సిరీస్‌లో హృతిక్‌ రోషన్, మూడో భాగంలో ఆమిర్‌ ఖాన్‌ విలన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి అనుభూతి పంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అదేంటంటే?

టాలీవుడ్‌ యువ కథానాయకులు నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'. సరికొత్త కథాంశంతో దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. గతంలో కొన్ని సన్నివేశాలకే పరిమితం అవుతాడన్నారు. కాదు పూర్తి స్థాయిలో విలన్‌గా దర్శనమివ్వబోతున్నాడని చిత్ర సీమలో ప్రచారం సాగుతోంది. అంతేకాదు 'వి' చిత్రాన్ని పలు సిరీస్‌లుగా తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ కథలోనూ విలనే కీలకం.

'ధూమ్‌' తరహాలో ఒక పాత్ర (సుధీర్‌ బాబు)ను స్థిరంగా ఉంచి, ప్రతినాయక పాత్రను మార్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మొదటి భాగంలో నాని కనిపిస్తే, రెండు, మూడు సిరీసుల్లో ఇతర హీరోలు నటిస్తారన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే నిజమైతే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. నాని 25వ చిత్రంగా తెరకెక్కుతున్న 'వి'లో నివేదా థామస్, అదితి రావు హైదరీ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. వరుణ్‌-కియారాల కొత్త చిత్రం 'మిస్టర్‌ లేలే'..!

ABOUT THE AUTHOR

...view details