తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చక్రాలకుర్చీపై ఇర్ఫాన్​.. కారణం ఇదేనా! - అంగ్రేజీ మీడియం

క్యాన్సర్​పై ఇంకా పోరాటం కొనసాగిస్తున్నాడు ప్రముఖ బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ఖాన్​. ఇటీవల 'అంగ్రేజీ మీడియం' సినిమా షూటింగ్​ కోసం లండన్​ వెళ్లిన ఈ యాక్టర్​... అక్కడ మరోసారి చికిత్స చేయించుకున్నాడు. తాజాగా ముంబయి విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో కనిపించాడు.

వీల్​ఛైర్​లో కనిపించిన ఇర్ఫాన్​ఖాన్​

By

Published : Sep 15, 2019, 9:37 AM IST

Updated : Sep 30, 2019, 4:11 PM IST

బాలీవుడ్​ విలక్షణ నటుడు ఇర్ఫాన్​ఖాన్​ క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నాడు. గతేడాది కొన్నినెలల పాటు విదేశాల్లో చికిత్స తీసుకున్న ఈ హీరో... మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.ప్రస్తుతం'హిందీ మీడియం' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతోన్న 'అంగ్రేజీ మీడియం'లో నటిస్తున్నాడు. షూటింగ్​ కోసం ఇటీవల లండన్​ వెళ్లిన ఇర్ఫాన్​... తాజాగా స్వదేశంలో అడుగుపెట్టాడు. ముంబయిలోని విమానాశ్రయంలో చక్రాలకుర్చీలో కూర్చొని కనిపించాడు.

విమానాశ్రయంలో ముఖాన్ని దాచుకొని వెళ్తున్న ఇర్ఫాన్​

అంగ్రేజీ మీడియం చిత్రీకరణ పూర్తయ్యాక... ఇర్ఫాన్​కు శస్త్రచికిత్స జరిగినట్లు ఇర్ఫాన్​ సన్నిహితుడు తెలిపాడు. ఇర్ఫాన్​.. ఇంటిపై బెంగ పెట్టుకున్నాడని అందుకే ముంబయిలో కొన్ని రోజులు గడపాలనుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో మీడియా ఎలాంటి పుకార్లు కల్పించకుండా మద్దతుగా ఉండాలని ఆయన కోరారు.

అంగ్రేజీ మీడియం పూర్తి...

అంగ్రేజీ మీడియంలో ఇర్ఫాన్​తో పాటు కరీనా కపూర్​, రాధికా మదన్​, డింపుల్​ కపాడియా కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఇర్ఫాన్​ చంపక్​ అనే పాత్రలో నటిస్తున్నాడు. కరీనా పోలీసుగా, రాధికా మదన్​ ఇర్ఫాన్​కు కూతురుగా కనిపించనుంది. దినేశ్​ విజన్​ నిర్మాత. దీనితో పాటు 'గుడ్​న్యూస్​' అనే చిత్రంలోనూ సందడి చేయనున్నాడు ఇర్ఫాన్​.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details