తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 9:55 PM IST

ETV Bharat / sitara

చర్చనీయాంశంగా 'మేజర్‌' అప్‌డేట్‌

అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తోన్న చిత్రం మేజర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

adivi shesh
మేజర్‌'

తెలుగు చిత్రసీమలో ఆలియా భట్‌ రెండో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చేయనున్నట్లు తెలుస్తోన్న ఆ రెండో ప్రాజెక్టు ఏంటంటే.. 'మేజర్‌'. అడివి శేష్‌ కథానాయకుడిగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

26-11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రానికి ఉత్తరాదిలో క్రేజ్‌ పెంచేందుకు.. శేష్‌కు జోడీగా ఆలియా భట్‌ను సంప్రదిస్తోందట చిత్రబృందం. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ఇప్పుడామె చేతిలో 'బ్రహ్మాస్త్ర'తో పాటు పలు పెద్ద చిత్రాలున్నాయి.

ఈ నేపథ్యంలో శేష్‌ వంటి యువ దక్షిణాది హీరో సరసన నటించేందుకు ఆలియా అంగీకరిస్తుందా లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. చిత్రబృందం మాత్రం ఆలియాతో ఈ సినిమా చేయించాలని పట్టుదలతో ప్రయత్నిస్తోందట. ఇప్పటికే ఈ చిత్ర విషయమై 'మేజర్‌' బృందం ఆమెతో చర్చలు జరుపుతోందట. ఒకవేళ ఈ సినిమాలో ఆలియా నటిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడుతుందనడంలో ఏ సందేహం లేదు.

ఇవీ చూడండి.. రెండు భాగాలుగా.. నితిన్‌ కొత్త చిత్రం..!

ABOUT THE AUTHOR

...view details