అభిమానులు తమ స్టార్స్ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అన్నాడు. కానీ సాధారణ ప్రేక్షకులూ చిత్రాల్ని ఇష్టపడేలా తీయాలని చెప్పాడు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన జక్కన్న.. ఇటీవల విడుదల చేసిన 'ఆర్.ఆర్.ఆర్' మోషన్ పోస్టర్ గురించి ముచ్చటించాడు. కరోనా ప్రభావం ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నాడు.
'వైరస్ నియంత్రణకు లాక్డౌన్ మంచిదే'
"ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ఎవరూ ఊహించలేదు. అంతా ఉన్నట్లుండి జరిగింది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. చివరి దశకు వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా భారత్కు వచ్చింది. దీంతో సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా రెండు రోజుల్లోనే సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఆపై నలుగురు ఆఫీసుకు వెళ్లి సినిమా పనులు చూసేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించడం, ఆపై 21 రోజులు లాక్డౌన్ ప్రకటించడం.. అంతా అకస్మాత్తుగా జరిగాయి. వైరస్ నియంత్రణకు ఇలా చేయడం మంచిదే"
అదో గొప్ప ఫీలింగ్
"నా మైండ్ సగం కరోనా ఆలోచనలతో నిండిపోయింది. మిగిలిన సగం.. చరణ్ పుట్టినరోజు వస్తోంది కదా అని, దానికి ముందే మోషన్ పోస్టర్ విడుదల చేయాలి. మనం చేయగలమా? లేదా? అనే ఆలోచనలతో ఉన్నా. మోషన్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. మన క్రియేటివిటీని ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు ప్రశంసిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది గొప్ప ఫీలింగ్"
సాధారణ ప్రేక్షకుడూ కేకలు వేయాలి